తలనీలాల స్మగ్లింగ్లో వైసీపీ నేతల పాత్ర: టీడీపీ
ABN , First Publish Date - 2021-08-27T08:23:15+05:30 IST
‘‘రాష్ట్రంలోని దేవాలయాల నుంచి తల నీలాలు విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతున్న వ్యవహారంలో వైసీపీ నేతల పాత్ర ఉంది.
![తలనీలాల స్మగ్లింగ్లో వైసీపీ నేతల పాత్ర: టీడీపీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని దేవాలయాల నుంచి తల నీలాలు విదేశాలకు స్మగ్లింగ్ జరుగుతున్న వ్యవహారంలో వైసీపీ నేతల పాత్ర ఉంది. మయన్మార్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు పట్టుకొనేవరకూ రాష్ట్రంలోని పోలీసులు దీనిని పట్టించుకోలేదు. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండటం వల్లే వారు మౌనంగా ఉండిపోయారు’’ అని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు విమర్శించారు.