ముత్యపు కవచంలో మలయప్పస్వామి అభయం
ABN , First Publish Date - 2021-06-24T08:51:11+05:30 IST
తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేక ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచం ధరించి అభయమిచ్చారు
తిరుమల, జూన్ 23(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేక ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచం ధరించి అభయమిచ్చారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ముత్యపు కవచ సమర్పణ జరిగింది. సహస్రదీపాలంకరణ సేవ తర్వాత స్వామి, అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.