అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు: లోకేష్
ABN , First Publish Date - 2021-08-01T21:08:42+05:30 IST
అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు: లోకేష్
అమరావతి: అవ్వాతాతల్ని ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పెన్షన్ 3 వేలకు పెంచుకుంటూ పోతామని రూ.250 పెంచి ఆగిపోయారన్నారు. ఒకటో తేదీనే తలుపులు ఇరగ్గొట్టి మరీ పెన్షన్ గడపకే ఇస్తామన్న ప్రగల్భాలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఈ రోజు 1వ తేదీ, 5 లక్షల మందికి పైగా పింఛన్లు అందలేదన్నారు. పింఛన్లు లేటు చేస్తే, పెంపు గురించి అడగరనే లాజిక్తో పింఛన్ ఇచ్చే ఒకటో తేదీని అలా పెంచుకుంటూ పోతున్నారా? అని ప్రశ్నించారు.