గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో లాక్ డౌన్

ABN , First Publish Date - 2021-04-09T22:45:51+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొల్లిపర మండలంలో అధికారులు లాక్‌డౌన్ విధించారు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో లాక్ డౌన్

గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కొల్లిపర మండలంలో అధికారులు లాక్‌డౌన్ విధించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యవసరాల కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాలలో హోటల్స్ , టిఫిన్ సెంటర్లు, టీ షాపులు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే భట్టిప్రోలు మండలంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. 


Updated Date - 2021-04-09T22:45:51+05:30 IST