లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2021-07-26T08:46:36+05:30 IST
గత పదిహేను ఏళ్లుగా లైబ్రేరియన్ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ లేదని, త్వరితగతిన డిజిటల్, పబ్లిక్ లైబ్రేరియన్లు.., డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ సిటీ, జూలై 25: గత పదిహేను ఏళ్లుగా లైబ్రేరియన్ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ లేదని, త్వరితగతిన డిజిటల్, పబ్లిక్ లైబ్రేరియన్లు.., డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ లైబ్రరీ సైన్స్ నిరుద్యోగ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రంఽథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావును ఆదివారం ఆయన నివాసంలో జేఏసీ నాయకులు మర్యాదకపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆయా పోస్టుల భర్తీ ఆంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. జేఏసీ నేతలు కె.జగదీష్, మేకా రమేష్, రమణప్ప, మహేంద్ర, రమే్షబాబు, పి.ఆంజనేయులు, కోటేశ్వరరావు, అనీల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.