హైకోర్టుకు జిల్లా జడ్జీల లేఖ
ABN , First Publish Date - 2021-07-06T23:32:34+05:30 IST
తమ అనుమానాన్ని నివృత్తి చేయాలని కోరుతూ హైకోర్టుకు జిల్లా జడ్జిలు లేఖ
అమరావతి: తమ అనుమానాన్ని నివృత్తి చేయాలని కోరుతూ హైకోర్టుకు జిల్లా జడ్జిలు లేఖ రాశారు. ఏపీలో ప్రజాప్రతినిధులపై ఉన్న పలు కేసులకు సంబంధించి అప్పీల్స్ను స్పెషల్ కోర్టులో విచారించే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కింద కోర్టుల్లో శిక్షలు పడితే, హైకోర్టుకు అప్పీల్స్కు రావటంతో తమ కోర్టుల్లో విచారణ చేయాలా అని హైకోర్టుకు జిల్లా జడ్జీలు లేఖ రాశారు. దీనిపై సమయం కావాలని పీపీ కోరడంతో ఈ నెల 15కి వాయిదా వేసింది.