ఆదర్శ్ స్మారక్ పథకంలోకి లేపాక్షి ఆలయం
ABN , First Publish Date - 2021-08-10T00:42:16+05:30 IST
ఏపీలోని నిర్మాణాలను మూడు కేంద్ర ప్రభుత్వ సంరక్షణలోని ఆదర్శ్ స్మారక్ పథకంలో
ఢిల్లీ: ఏపీలోని మూడు నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వ సంరక్షణలోని ఆదర్శ్ స్మారక్ పథకంలో చేర్చుతున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం ఇచ్చారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్ర ఆలయం, శ్రీకాకుళం శాలిహుండం బౌద్ధ నిర్మాణాలు, గుంటూరు జిల్లా నాగార్జున కొండపై పునర్నిర్మించిన కట్టడాలను వీటిలో చేర్చుతున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంరక్షణలోని నిర్మాణాల నిర్వహణ బాధ్యతను ఏఎస్ఐ చూసుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు.