ఏపీ రాజధానిపై వైయస్సార్సీపీ తప్పుడు ప్రచారం: లంకా దినకర్
ABN , First Publish Date - 2021-08-30T16:47:07+05:30 IST
వైయస్సార్సీపీ రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు.
అమరావతి: దేశంలో అత్యధిక పన్నులు పెట్రోలు మీద వేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే వాస్తవాన్ని పక్క దోవ పట్టించేందుకు వైయస్సార్సీపీ రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు, అధికారులు పదే పదే ఢిల్లీలో తిరుగుతూ వైజాగ్ రాజధాని అని తప్పుడు విజిటింగ్ కార్డులతో అక్కడ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానం ప్రజలలో వస్తుందన్నారు. మూడు రాజధానుల అంశం కోర్టులో ఉందని, తీర్పు వచ్చే వరకు సంయమనం అవసరన్నారు. అమరావతి రైతులకు నమ్మకద్రోహం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, వారితో మాట్లాడమని అంటే భవిష్యత్తులో ఏ రైతు ప్రభుత్వానికి సహకరించరని లంకా దినకర్ అన్నారు.