కేఆర్ఎంబీ బృందం రాయలసీమ పర్యటన వాయిదా
ABN , First Publish Date - 2021-08-05T02:45:18+05:30 IST
కేఆర్ఎంబీ బృందం రాయలసీమ పర్యటన వాయిదా
హైదరాబాద్/అమరావతి: కేఆర్ఎంబీ బృందం పర్యటన వాయిదా పడింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో గురువారం పర్యటిస్తామని కేఆర్ఎంబీ బృందం ముందే ప్రకటించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకే కేఆర్ఎంబీ బృందం ఈ పర్యటనను వాయిదా వేసుకుంది. కేఆర్ఎంబీ బృందంలో దేవేందర్రావు అనే తెలంగాణ వాది ఉన్నారని ఆంధ్రా అధికారులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అందువల్లే బృందం పర్యటనను కేఆర్ఎంబీ వాయిదా వేసింది. ఎన్జీటీ ఆదేశించినప్పటికీ కేఆర్ఎంబీ సొంత బృందాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ఆంద్రా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ నెల 9న జీఆర్ఎంబీ అమరావతిలో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు మెంబర్ సెక్రటరీ బీపీ పాండే ఆదేశాలు జారీ చేశారు. జీఆర్ఎంబీ పరిధిలో కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్పై చర్చించనున్నారు. గెజిట్ నోటిఫికేషన్ అనంతరం జీఆర్ఎంబీ వ్యవస్థ నిర్మాణంపై మెంబర్ సెక్రటరీ చర్చించనున్నారు. నోటిఫికేషన్లోని పలు క్లాజులపైనా చర్చిస్తామని అధికారులు పేర్కొన్నారు.