‘కర్నూలులో క్రిష్ణా బోర్డు ఏర్పాటు చేయాలి’
ABN , First Publish Date - 2021-08-20T19:10:46+05:30 IST
కర్నూలులో క్రిష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నేడు వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ...
![‘కర్నూలులో క్రిష్ణా బోర్డు ఏర్పాటు చేయాలి’](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు: కర్నూలులో క్రిష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నేడు వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... నిధులు నీళ్లు నియామకాల్లో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. న్యాయ రాజధాని, క్రిష్ణా బోర్డు ఏర్పాటులో సీఎం జగన్ ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వద్ద ఆందోళన చేపడతామని విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు.