ఏపీ అసెంబ్లీలో వ్వవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన కన్నబాబు
ABN , First Publish Date - 2021-05-20T19:09:18+05:30 IST
అమరావతి: నేడు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

అమరావతి: నేడు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2021-22 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఏపీ అసెంబ్లీలో మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు..
రెవెన్యూ వ్యయం రూ.1,82,196 కోట్లు, మూలధన వ్యయం రూ.47,582 కోట్లు
ద్రవ్య లోటు రూ.37,029.79 కోట్లు, రెవెన్యూ లోటు రూ.5 వేల కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.49 శాతం, రెవెన్యూ లోటు 0.47 శాతం
రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.6.637 కోట్లు
పారిశ్రామిక అభివృద్ధికి రూ.3,673 కోట్లు
తొలిసారిగా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
2021-22 వార్షిక బడ్జెట్లో రూ.47 వేల 283 కోట్లు జెండర్ బడ్జెట్
చిన్నపిల్లలకు చైల్డ్ బడ్జెట్లో రూ.16,748.47 కోట్లు
బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసిన ఏపీ ప్రభుత్వం