కడప: ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2021-03-09T16:03:32+05:30 IST
జమ్మలమడుగులో అధికారపార్టీ నేతలు ఎన్నికల నిభందనలు ఉల్లంఘించారు.
కడప జిల్లా: జమ్మలమడుగులో అధికారపార్టీ నేతలు ఎన్నికల నిభందనలు ఉల్లంఘించారు. సోమవారంతో ప్రచార ఘట్టం ముగిసినప్పటికీ.. మంగళవారం ఉదయం స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన కార్యకర్తలతో కలసి జమ్మలమడుగు రోడ్లపై తిరుగుతున్నారు. ఎన్నికల యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.