ఉద్యోగ భద్రత కల్పించాలి
ABN , First Publish Date - 2021-07-27T07:45:55+05:30 IST
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బీమామిత్రలు ఆందోళన నిర్వహించారు. తాడేపల్లిలో సోమవారం వారు నిరసనకు దిగారు
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బీమా మిత్రల ఆందోళన
తాడేపల్లి టౌన్, జూలై26: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బీమామిత్రలు ఆందోళన నిర్వహించారు. తాడేపల్లిలో సోమవారం వారు నిరసనకు దిగారు. సీఎంను కలవడానికి అనుమతి లేదని, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వావాదం జరిగింది. ఈ సందర్భంగా బీమా మిత్రలు మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇన్సెంటెవ్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో బీమా పథకం నిర్వహణను వలంటీర్లకు అప్పగించారని వాపోయారు. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే, సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీ కార్యాలయాల వద్ద సోమవారం ధర్నాలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తిండి పెడితే, జగన్ నోటికాడ కూడు తీసే పనులు చేస్తున్నారని, బీమామిత్రలకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారని ఆవేదన వెలిబుచ్చారు.