టీడీపీలో చేరిన జీవీ రెడ్డి
ABN , First Publish Date - 2021-10-21T09:34:54+05:30 IST
కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం సాయంత్రం ఇక్కడ తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకొన్నారు. తనను చేర్చుకొన్నందుకు చంద్రబాబుకు జీవీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.