ఏప్రిల్ 14న ‘జై భీమ్’ బహిరంగ సభ
ABN , First Publish Date - 2021-03-21T09:31:19+05:30 IST
ఏప్రిల్ 14న ‘జై భీమ్’ బహిరంగ సభ

గుంటూరు(తూర్పు), మార్చి 20: రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నయ అవసరం ఏర్పడిందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, న్యాయవాది, జై భీమ్ యాక్సస్ అధ్యక్షుడు జడా శ్రావణ్కుమార్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజ్యాధికారం దిశగా నడవాలని ఆకాక్షించారు. శనివారం గుంటూరులో జరిగిన అంబేడ్కర్ వారసుల అత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల రాజకీయ ప్రవేశం దిశగా అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న గుంటూరులో జైభీమ్ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.