జగన్ అక్రమాస్తుల కేసు: విజయసాయిపై సీబీఐ కోర్టు ఫైర్

ABN , First Publish Date - 2021-08-10T17:36:29+05:30 IST

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. తాము ఇచ్చిన నోటీస్‌కు విజయసాయి స్పందించలేదని పిటిషనర్ తెలిపారు.

జగన్ అక్రమాస్తుల కేసు: విజయసాయిపై సీబీఐ కోర్టు ఫైర్

హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ నిర్వహించింది. తాము ఇచ్చిన నోటీస్‌కు విజయసాయి స్పందించలేదని పిటిషనర్ తెలిపారు. కోర్టు ఆదేశాలిస్తేనే తాము నోటీస్ తీసుకుంటామని చెప్పారని.. పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. పిటిషనర్ ఇచ్చిన నోటీస్‌కి సీబీఐ స్పందించింది. మీరు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ, విజయసాయిరెడ్డికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

Updated Date - 2021-08-10T17:36:29+05:30 IST