‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-07-08T09:25:49+05:30 IST
గణతంత్ర దినోత్సవం 2022 సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ఠ నైపుణ్యం, ప్రతిభ చూపినవారికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించనుందని కృషి, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పీఎ్సఆర్

గణతంత్ర దినోత్సవం 2022 సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ఠ నైపుణ్యం, ప్రతిభ చూపినవారికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించనుందని కృషి, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పీఎ్సఆర్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన యువత, యువజన సంఘాలు, సేవా సంఘాలు, క్రీడాకారులు.. రికార్డు పూర్వక ఆధారాలతో జిల్లా కలెక్టర్ వారి ప్రతిపాదనలు, సిఫారసులతో ఆన్లైన్లో ఈనెల 14లోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పద్మఅవార్డ్సు.జీవోవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.