విశాఖ, విజయవాడల్లో వాయు నాణ్యత పెంపు
ABN , First Publish Date - 2021-04-17T09:59:08+05:30 IST
రాష్ట్రంలోని 10 లక్షలకుపైగా జనాభా ఉన్న విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 10 లక్షలకుపైగా జనాభా ఉన్న విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ క్రమంలో వాయు నాణ్యతను పెంచేందుకు ఉద్దేశించిన వివిధ పథకాలు, చర్యల అమలు తీరుతెన్నులను పర్యవేక్షించ నుంది. అదేవిధంగా వాటికోసం వెచ్చించే నిధులు సద్వినియోగమయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమియమించింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను మేరకు చేపట్టే ఆయా పథకాలపై పర్యవేక్షణకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖల సూచనలను అనుసరించి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాష్ట్ర నోడల్ అధికారిగా పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నోడల్ అధికారిగా డాక్టర్ వి.సన్యాసిరావు, విజయవాడ నగర పాలక సంస్థకు యు.శారదాదేవిలను నియమించారు. సన్యాసిరావు, శారదాదేవి ఆయా నగర పాలక సంస్థల్లో అడిషనల్ కమిషనర్లు(ప్రాజెక్ట్స్)గా ఉన్నారు.