‘ఐఎన్ఎస్ రాజ్పుత్’ సేవలకు సెలవు
ABN , First Publish Date - 2021-05-21T09:48:38+05:30 IST
భారత నౌకాదళంలో 41 ఏళ్లపాటు విశేష సేవలందించిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ రాజ్పుత్’ శుక్రవారం తన సేవలు విరమించనుంది

నేడు సేవలు విరమించనున్న యుద్ధనౌక
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళంలో 41 ఏళ్లపాటు విశేష సేవలందించిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ రాజ్పుత్’ శుక్రవారం తన సేవలు విరమించనుంది. కషిన్ క్లాస్కు చెందిన ఈ యుద్ధ నౌక రష్యా (ప్రస్తుతం ఉక్రెయిన్)లో తయారైంది. 1980లో మే 4న భారత నౌకాదళంలో చేరింది. ఇటు తూర్పు, అటు పశ్చిమ దళంలోనూ సేవలు అందించింది. కెప్టెన్ గులాబ్ మోహన్లాల్ హిరానందని దీనికి తొలి కమాండింగ్ అధికారి. విశాఖపట్నం నావల్ డాక్యార్డులో కొవిడ్ నిబంధనల మధ్య శుక్రవారం సాయంత్రం ‘రాజ్పుత్’ను డీకమిషనింగ్ చేయనున్నారు.