మాన్సాస్ ట్రస్ట్పై తీర్పు మరో చెంప దెబ్బ కాదా?
ABN , First Publish Date - 2021-06-15T01:13:55+05:30 IST
మాన్సాస్ ట్రస్ట్పై తీర్పు మరో చెంప దెబ్బ కాదా?
అమరావతి: మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్పర్సన్గా ఉన్న సంచయిత గజపతి నియామక ప్రభుత్వ జీవోను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఆదేశించింది. గతంలో ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ.. సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. జీవోలను సవాల్ చేస్తూ అశోక్గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఏపీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. పాత జీవోల ప్రకారం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్గా అశోక్ను కొనసాగించాలని కోర్పు ఆదేశించింది.
ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘మాన్సాస్ ట్రస్ట్పై తీర్పు మరో చెంప దెబ్బ కాదా?. అప్పన్న భూముల్ని అప్పనంగా కొట్టేద్దామనుకున్నారా?. అశోక్ గజపతిరాజును తప్పించినప్పుడే ఆకాశంపైకి ఉమ్మేస్తున్నావని చెప్పారుగా?. వైసీపీని గుడ్డిగా నమ్మినందుకే సంచయిత దెబ్బతిన్నారా?. ఆరు నెలలుగా జరిగిన అక్రమాలకు బాధ్యులెవరవుతారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.