హోదాను జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టారు: హర్షకుమార్
ABN , First Publish Date - 2021-06-20T09:18:57+05:30 IST
‘‘రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించడంలో జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు హోదా విషయాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు’’ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ
రాజమహేంద్రవరం సిటీ, జూన్ 19: ‘‘రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సాధించడంలో జగన్మోహన్రెడ్డి విఫలమయ్యారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు హోదా విషయాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు’’ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన స్వప్రయోజనాలే ముఖ్యమని ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని హర్షకుమార్ ధ్వజమెత్తారు.