గుంటూరులో మానసిక వికలాంగురాలిపై దారుణం
ABN , First Publish Date - 2021-07-22T00:52:45+05:30 IST
గుంటూరులో మానసిక వికలాంగురాలిపై దారుణం
గుంటూరు: రొంపిచెర్ల మండలం తుంగపాడులో మానసిక వికలాంగురాలుపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుంగపాడులో పొలానికి గేదెలు తొలుకొని వెళ్లిన బాధితురాలను అదే గ్రామానికి చెందిన ఆలూరి శేషగిరావు అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూతురు నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలూరి శేషగిరిరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.