గుంటూరు: నగరపాలక సహా 5 మున్సిపాల్టీలు వైసీపీ కైవసం

ABN , First Publish Date - 2021-03-14T20:31:44+05:30 IST

గుంటూరు: నగరపాలక సహా ఐదు మున్సిపాల్టీలను వైసీపీ కైవసం చేసుకుంది.

గుంటూరు: నగరపాలక సహా 5 మున్సిపాల్టీలు వైసీపీ కైవసం

గుంటూరు: నగరపాలక సహా ఐదు మున్సిపాల్టీలను అధికారపార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. డివిజన్‌లో టీడీపీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే ఓటింగ్ శాతం తగ్గిందా? పెరిగిందా? అన్నది ఈ సాయంత్రంలోగా తెలిసే అవకాశం ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలో 57 డివిజన్లతోపాటు ఐదు మున్సిపాల్టీలతో కలిపి 290 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. కేవలం 35 వార్డుల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాదించారు. బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు ఖాతా తెరవలేదు. 


గుంటూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించలేదు. అధికారపార్టీకి సంబంధించి ఇద్దరు మంత్రులు, ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు గుంటూరు నగరపాలక సంస్థలోనే తిష్టవేశారు. టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థి రవీంద్ర, తూర్పు ఇన్చార్జ్ నజీర్‌లు మినహా టీడీపీ నేతలు ఎవరూ ఇక్కడ దృష్టి సారించలేదు. కనీసం ప్రచారం చేయడానికి కూడా రాలేదు. దీంతో ఇక్కడ టీడీపీ ప్రభావం చూపలేకపోయింది.

Updated Date - 2021-03-14T20:31:44+05:30 IST