విస్తృత ప్రచారంతోనే కరోనా కట్టడి: గవర్నర్
ABN , First Publish Date - 2021-04-13T09:44:34+05:30 IST
కరోనా సవాళ్లను అధికమించేందుకు రెడ్క్రాస్, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు విస్తృత ప్రచారాన్ని ఎంచుకోవాలని గవర్నర్
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కరోనా సవాళ్లను అధికమించేందుకు రెడ్క్రాస్, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు విస్తృత ప్రచారాన్ని ఎంచుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ రాజ్భవన్ నుంచి 13 జిల్లాల సంయుక్త పాలనాధికారులు, రెడ్క్రాస్ సొసైటీ-ఏపీ స్టేట్ బ్రాంచ్, జిల్లా శాఖల బాధ్యులకు కరోనా కట్టడిపై గవర్నర్ వెబినార్ ద్వారా దిశానిర్దేశం చేశారు. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వంటి అంశాలపై ప్రజల్లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత రెడ్క్రాస్ ప్రతినిధులపై ఉందన్నారు.