పొన్నూరులో మిజోరం గవర్నరు డాక్టర్ హరిబాబు పర్యటన
ABN , First Publish Date - 2021-10-29T01:56:41+05:30 IST
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలులో గురువారం సాయంత్రం మిజోరం రాష్ట్ర గవర్నరు డాక్టర్ కంభంపాటి హరిబాబు దంపతులు పర్యటించారు.

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలులో గురువారం సాయంత్రం మిజోరం రాష్ట్ర గవర్నరు డాక్టర్ కంభంపాటి హరిబాబు దంపతులు పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి పాములపాటి అంకినీడు ప్రసాదరావు స్వగృహనికి విచ్చేసిన గవర్నరు హరిబాబు దంపతులు పాములపాటి ప్రసాదరావు సతీమణి శివప్రదాదేవిని పరామర్శించారు. తెనాలి సబ్కలెక్టర్ మీనా, హరిబాబుకు ఘనస్వాగతం పలికారు.