ఏపీకి ‘హోదా’ ఇవ్వరా?

ABN , First Publish Date - 2021-02-06T09:46:05+05:30 IST

‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోరా? ప్రధాని హామీకి విలువే లేదా? ఇలాగైతే ప్రజాస్వామ్యంపై గౌరవం, నమ్మకం సన్నగిల్లిపోతుంది.

ఏపీకి ‘హోదా’ ఇవ్వరా?

పోలవరం ‘సవరణ’ను ఆమోదించండి: రాజ్యసభలో ఎంపీ బోస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోరా? ప్రధాని హామీకి విలువే లేదా? ఇలాగైతే ప్రజాస్వామ్యంపై గౌరవం, నమ్మకం సన్నగిల్లిపోతుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఆలోచించాలి’’ అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన తెలుగులో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదిస్తూ నిర్దిష్ట ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-02-06T09:46:05+05:30 IST