ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కొవిడ్‌ విస్తరిస్తోంది: ఉమా

ABN , First Publish Date - 2021-05-20T09:09:01+05:30 IST

ప్రభుత్వ అసమర్థత, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని

ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కొవిడ్‌ విస్తరిస్తోంది: ఉమా

జి.కొండూరు, మే 19: ప్రభుత్వ అసమర్థత, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్‌ చేశారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేగిందన్నారు. ఒక పక్క కేసులు, మరో పక్క చావులతో విలయం ఆగడం లేదన్నారు. వాస్తవ లెక్కలతో గణాంకాలకు పొంతన లేదన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం మార్చిలో బడ్జెట్‌ వాయిదా వేశారని ఆరోపించారు. మొక్కుబడి తంతుగా ఒక్క రోజు బడ్జెట్‌ సమావేశాలు పెట్టారన్నారు. అసలు కరోనా కష్ట సమయాల్లో బడ్జెట్‌ సమావేశాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వైఎస్‌ జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-05-20T09:09:01+05:30 IST