వివేకా హత్యతో నాకు సంబంధం లేదు: ఆది
ABN , First Publish Date - 2021-04-11T09:30:11+05:30 IST
‘‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో నాకెలాంటి సంబంధం లేదు. కావాలనే నా పేరును చార్జిషీట్లో చేర్చారు.
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 10: ‘‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో నాకెలాంటి సంబంధం లేదు. కావాలనే నా పేరును చార్జిషీట్లో చేర్చారు. నేనుగాని దోషినైతే నన్ను ఉరి తీయండి’’ అని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో మాట్లాడారు. ‘‘2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్యకు గురైనట్టు తెలిసింది. అప్పట్లో తాను టీడీపీలో ఉన్నందున సీట్ల విషయమై చంద్రబాబుతో చర్చల్లో ఉన్నా ను. వివేకానందరెడ్డి గుండె పోటుతో మరణించినట్టు 15వ తేదీ ఉదయం టీవీలో స్ర్కోలింగు చూసి తెలుసుకున్నా. మళ్లీ నాలుగు గంటల తరువాత వివేకానందరెడ్డిని హత్య చేసినట్టు తెలిసింది’’ అని పేర్కొన్నారు.