రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు..8 నుంచి 11.30 వరకే పనిగంటలు
ABN , First Publish Date - 2021-05-08T08:26:02+05:30 IST
కొవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
కొవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, ఉప జిల్లా కార్యాలయాల వరకు అన్నింటిలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇవే పనివేళలు వర్తిస్తాయని పేర్కొన్నారు. అత్యవసర విధులు నిర్వహించే వైద్య, పురపాలక, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ తదితర కార్యాలయాల్లోని ఉద్యోగులు మాత్రం యథావిథిగా సాయంత్రం వరకు పనిచేయాల్సి ఉంటుంది.