75 ఏళ్లుగా మాదిగలకు న్యాయం జరగలేదు

ABN , First Publish Date - 2021-12-30T08:36:16+05:30 IST

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా దేశంలో పాలకులు మాదిగలకు న్యాయం చేయలేకపోయారని మాదిగ దినోత్సవ ప్లీనరీలో నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.

75 ఏళ్లుగా మాదిగలకు  న్యాయం జరగలేదు

ప్రపంచ మాదిగ దినోత్సవ సభలో నేతలు 

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 29: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా దేశంలో పాలకులు మాదిగలకు న్యాయం చేయలేకపోయారని మాదిగ దినోత్సవ ప్లీనరీలో నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇన్‌ప్రామ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన 4వ ప్రపంచ మాదిగ దినోత్సవ ప్లీనరీ సమావేశంలో లిడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కాకుమాను రాజశేఖర్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, ఎమ్మెల్యే శ్రీదేవి, సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌, గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్‌ హెన్రీ క్రిస్టినా, పారిశ్రామికవేత్తలు కె.రాజమోహన్‌, బీఆర్‌ మునిరాజ్‌, డాక్టర్‌ ప్రశాంత్‌, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరత్నం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని అన్నిరంగాల్లో మాదిగలకు ప్రాధాన్యం కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు.

Updated Date - 2021-12-30T08:36:16+05:30 IST