AP: కత్తిపూడిలో లారీని ఢీకొన్న కారు..ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-09-09T14:28:20+05:30 IST
కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురి
తూర్పు గోదావరి: కత్తిపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.