త్వరలో కల్యాణమస్తు ప్రారంభించాలని ధర్మప్రచార పరిషత్ నిర్ణయం
ABN , First Publish Date - 2021-02-06T01:09:21+05:30 IST
ధర్మప్రచార పరిషత్ నిర్ణయం పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని
![త్వరలో కల్యాణమస్తు ప్రారంభించాలని ధర్మప్రచార పరిషత్ నిర్ణయం](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020506364579/02052021193912n27.jpg)
తిరుమల: ధర్మప్రచార పరిషత్ నిర్ణయం పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ‘గుడికో గోమాత’లో భాగంగా దేవాలయాలకు ఉచితంగా గోవు, దూడ ఇవ్వాలని, భక్తుల నుంచి దేశీయ గోవులను దానంగా స్వీకరించాలని నిర్ణయించారు. త్వరలో కల్యాణమస్తు ప్రారంభించాలని ధర్మాప్రచార పరిషత్ నిర్ణయం తీసుకుంది.
‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరం జూబ్లిహిల్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక ఆవు, దూడను టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అందజేశారు. గో సంరక్షణ, ప్రతి గుడిలోనూ పూజలు నిర్వహించేలా ఈ కార్యక్రమాన్ని ఇటీవల విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో టీటీడీ శ్రీకారం చుట్టారు. రెండో విడుతగా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి గుడికి దేశవాళీ ఆవులను దానంగా ఇవ్వాలని టీటీడీ పిలుపునిచ్చింది.