వైసీపీ పాలనలో అభివృద్ధి జీరో: యనమల
ABN , First Publish Date - 2021-08-28T20:13:26+05:30 IST
వైసీపీ పాలనలో అభివృద్ధి జీరో అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: వైసీపీ పాలనలో అభివృద్ధి జీరో అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందన్నారు. రెండేళ్లలోనే 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా అభివృద్ది లేదని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.