కృష్ణపట్నంలో ‘డీ సల్ఫరైజేషన్’ టెక్నాలజీ
ABN , First Publish Date - 2021-04-19T09:32:08+05:30 IST
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో సల్ఫర్ ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఏపీ జెన్కో నిర్ణయించింది.
అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో సల్ఫర్ ఉద్గారాలను తగ్గించే టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ సూచించిన నమూనా ప్రకారం ఫ్లూ గ్యాస్లోని సల్ఫర్ ఉద్గారాలను తగ్గించడానికి ఈ విధానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విధానం అమలుకు రూ.900 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన టెండర్ పత్రాలను న్యాయ పరిశీలనకు పంపారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 26 వరకు న్యాయ పరిశీలన కమిషన్ వెబ్సైట్కు పంపవచ్చని విద్యుత్ శాఖ వర్గాలు తెలిపాయి.