Indrakeeladri పై శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం
ABN , First Publish Date - 2021-10-10T12:49:12+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజు కనకదుర్గమ్మ అమ్మవారు ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుండి బారులు తీరారు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవరోజు కనకదుర్గమ్మ అమ్మవారు ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుండి బారులు తీరారు. రాత్రి 10 గంటల వరకు లలితా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకుంటారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలవబడుతోంది. శ్రీదేవి శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరీ మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్ని ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. లక్ష్మీ దేవిని, సరస్వతిదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమంద హాసంతో భక్తిపావనాన్ని చిందే చెరుకుగడను చేతబట్టుకుని శివుని వృక్ష స్థలంపై కూర్చుని దేవి దర్శనమిస్తుంది.