ఆధార్తోనే పంటల బీమా, విత్తన రాయితీ
ABN , First Publish Date - 2021-05-05T09:05:01+05:30 IST
రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల బీమా పరిహారం, రాయితీ విత్తనాల లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల బీమా పరిహారం, రాయితీ విత్తనాల లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ అనుసంధానం కానివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.