టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు

ABN , First Publish Date - 2021-05-08T00:47:13+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. సుబ్బయ్య అనే

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు

అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సామాన్య జనాలు భయాందోళనకు గురి అవుతున్నారని సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 188,505(1)(బి)(2) సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్ 54 కింద నాన్‌బెయిల్ సెక్షన్లను నమోదు చేశారు. 


Updated Date - 2021-05-08T00:47:13+05:30 IST