హోదాపై మాట మార్చడం తగునా?
ABN , First Publish Date - 2021-06-21T10:52:34+05:30 IST
ఏపీకి ప్రత్యేక హోదాపై రెండేళ్ల తర్వాత సీఎం జగన్మోహన్రెడ్డి మాటమార్చడం తగదు. హోదా సాధనకై ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలి’’
![హోదాపై మాట మార్చడం తగునా?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఏపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి: రామకృష్ణ
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ‘‘ఏపీకి ప్రత్యేక హోదాపై రెండేళ్ల తర్వాత సీఎం జగన్మోహన్రెడ్డి మాటమార్చడం తగదు. హోదా సాధనకై ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలంతా తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.