స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ రౌండ్టేబుల్ సమావేశం
ABN , First Publish Date - 2021-07-12T19:09:28+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. జులై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసనలు చేపట్టాలని తీర్మానం చేసింది.
![స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ రౌండ్టేబుల్ సమావేశం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921071201374769/07122021133915n21.jpg)
విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. జులై నెలాఖరున భారీగా ఉద్యమాలు, నిరసనలు చేపట్టాలని తీర్మానం చేసింది. 150 రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పరం చేయడంలేదని సోమువీర్రాజు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ఇకపై సీఎం జగన్ కూడా నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.