కరోనా సోకిందనే ఆవేదనతో దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-21T15:37:18+05:30 IST
విజయవాడ: కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే ఆవేదనతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విజయవాడ: కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే ఆవేదనతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు జక్కుల లీలా ప్రసాద్, భారతి దంపతులిద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాలను పోలీసులు, మెడికల్ సిబ్బంది మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు.