ఏపీ కరోనా తాజా అప్డేట్
ABN , First Publish Date - 2021-11-05T23:09:10+05:30 IST
ఏపీ కరోనా తాజా అప్డేట్

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 150 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో ముగ్గురు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,67,76 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనావైరస్ తో 14,391 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 3,760 యాక్టివ్ కేసులు ఉండగా, మొత్తం 20,49,555 మంది రికవరీ అయ్యారు.