ఏపీకి కరోనా నిధులు 324 కోట్లు
ABN , First Publish Date - 2021-02-06T09:49:31+05:30 IST
కరోనా కట్టడి కోసం ఏపీకి రూ.324.27 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు.

కరోనా కట్టడి కోసం ఏపీకి రూ.324.27 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. వైసీపీ ఎంపీలు అవినాశ్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాగా, సరైన డాక్యుమెంట్లు అందించనందున ఉజ్వల, స్వధార్ పథకాల కింద ఏపీకి నిధులు విడుదల చేయలేదని కేంద్ర మహిళా, శిశు శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.