రాజమండ్రి కాలేజీలో మరో 55 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-03-28T02:57:48+05:30 IST
నగరంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తిరుమల కాలేజీ హాస్టల్లో
రాజమండ్రి: నగరంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తిరుమల కాలేజీ హాస్టల్లో మరో 55 మందికి కరోనా సోకింది.దీంతో ప్రస్తుతం కాలేజీ హాస్టల్లో 230కి కరోనా కేసుల సంఖ్య చేరింది. మూడు రోజుల క్రితం ఏకంగా 175 మంది విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా సోకిన విద్యార్థులకు హాస్టల్లోనే చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రిలోని జూనియర్ కాలేజీ హాస్టల్లో 230 మందికి కరోనా పాజిటివ్ రావడం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది.