ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో 40 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-04-19T21:20:35+05:30 IST
ఏపీలోని సచివాలయం ఉద్యోగుల్లో 40 మందికి కరోనా సోకింది. దీంతో
అమరావతి: ఏపీలోని సచివాలయం ఉద్యోగుల్లో 40 మందికి కరోనా సోకింది. దీంతో సచివాలయం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. కరోనాతో నలుగురు సచివాలయం ఉద్యోగులు మరణించారని ఆ లేఖలో పేర్కొంది. కనీసం 50 శాతం ఉద్యోగుల హాజరునైనా అమలు చేయాలని ప్రభుత్వానికి సంఘం విజ్ఞప్తి చేసింది.