13 వేలు దాటిన మరణాలు
ABN , First Publish Date - 2021-07-12T08:17:11+05:30 IST
రాష్ట్రంలో కరోనా మరణాలు 13 వేల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 16 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
![13 వేలు దాటిన మరణాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
24 గంటల్లో కరోనాతో 16 మంది మృతి
రాష్ట్రంలో మరో 2,665 పాజిటివ్ కేసులు
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా మరణాలు 13 వేల మార్కుని దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 16 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొదటి, రెండో దశల్లో కలిపి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 13,002 మంది చనిపోయారు. మరోవైపు కొత్తగా 2,665 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 19,22,843కి చేరుకుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 529 మందికి వైరస్ సోకగా.. చిత్తూరులో 353, పశ్చిమగోదావరిలో 293, ప్రకాశంలో 285, కృష్ణాలో 281, గుంటూరులో 223 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు వ్యవధిలో 3,231 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య 18,81,161కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్ కేసులున్నాయి.