అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో వివాదాస్పద ఫ్లెక్సీలు
ABN , First Publish Date - 2021-04-14T21:34:25+05:30 IST
అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని కళామందిర్ సెంటర్లో వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి.
గుంటూరు: అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలోని కళామందిర్ సెంటర్లో వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో బ్రాహ్మణ సంక్షేమ సంఘం నేత సిరిపురపు శ్రీధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రాహ్మణులను కించపరచడం సరికాదని శ్రీధర్ పేర్కొన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చొరవతో ఫ్లెక్సీలను తొలగించారు.