14న తిరుపతిలో దక్షిణాది రాష్ర్టాల సమావేశం
ABN , First Publish Date - 2021-11-02T08:01:14+05:30 IST
తిరుపతిలో ఈ నెల 14న 29వ సౌత్ జోన్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు
![14న తిరుపతిలో దక్షిణాది రాష్ర్టాల సమావేశం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి.. ఐదు రాష్ర్టాల సీఎంలు
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 1: తిరుపతిలో ఈ నెల 14న 29వ సౌత్ జోన్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్, లక్షదీవులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. తర్వాత అమిత్షా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు.