హక్కులకు భంగం కలిగితే ఫిర్యాదు చేయండి

ABN , First Publish Date - 2021-09-02T09:10:45+05:30 IST

‘‘రాష్ట్రంలో పౌరుల హక్కులకు భంగం వాటిల్లితే కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో కొంత కాలం ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తాం’’ అని రాష్ట్ర మానవ హక్కుల కమిష

హక్కులకు భంగం కలిగితే ఫిర్యాదు చేయండి

కర్నూలులో ఎస్‌హెచ్‌ఆర్సీ కార్యాలయం ప్రారంభోత్సవంలో జస్టిస్‌ సీతారామమూర్తి


కర్నూలు(లీగల్‌), సెప్టెంబరు 1: ‘‘రాష్ట్రంలో పౌరుల హక్కులకు భంగం వాటిల్లితే కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో కొంత కాలం ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తాం’’ అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి అన్నారు. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలోని 1, 2, 4 గదులలో ఏర్పాటు చేసిన ఎస్‌హెచ్‌ఆర్సీ కార్యాలయాన్ని బుధవారం చైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జ్యుడీషియల్‌ సభ్యులు జస్టిస్‌ డి.సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులు జి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషన్‌ చైర్మన్‌ మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు కమిషన్‌ తన కార్యకలాపాలను హైదరాబాదు నుంచే నిర్వహించిందని, ఇక నుంచి కర్నూలు నుంచి నిర్వహిస్తుందని తెలిపారు. 

Updated Date - 2021-09-02T09:10:45+05:30 IST