ఒడిశా సీఎంకు జగన్ లేఖ
ABN , First Publish Date - 2021-04-17T19:20:40+05:30 IST
ఒడిశా సీఎంకు జగన్ లేఖ
విజయవాడ: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు సీఎం జగన్ లేఖ రాశారు. ఇరురాష్ట్రాల మధ్య ఉన్న నీటి ఒప్పందాలు అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వంశధార వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పు ప్రకారం.. నేరడి బ్యారేజ్ నిర్మించుకునేందుకు అనుమతి ఉందన్నారు. చర్చలకు ఒడిశా సీఎం సమయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో శ్రీకాకుళం, ఒడిశాలోని గజపతి జిల్లాకు మేలన్నారు. ఇప్పటికే 80 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని లేఖలో పేర్కొన్నారు.