chittoor జిల్లాలో నేటి ‘పరిషత్’ స్థానాల కౌంటింగ్
ABN , First Publish Date - 2021-11-18T12:04:25+05:30 IST
చిత్తూరు : పరిషత్ ఓట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు...
చిత్తూరు : పరిషత్ ఓట్ల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి ఎంఎస్.మురళి, జడ్పీ సీఈవో ప్రభాకర్ తెలిపారు. బంగారుపాళ్యం జడ్పీటీసీతో పాటు గుడిపాల, గుడుపల్లె, కేవీపల్లె, కుప్పం, నగరి, ఎస్ఆర్పురం, శాంతిపురం మండలాల్లోని 8 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి గురువారం ఆయా ప్రాంతాల్లో జరిగే కౌంటింగ్కు 30 టేబుల్స్ ఏర్పాట్లు చేయగా, 142 మంది సిబ్బందిని కౌంటింగ్కు నియమించినట్టు చెప్పారు. బంగారుపాళ్యం జడ్పీ హైస్కూల్లో కౌంటింగ్కు 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా, 67 మంది సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఎంపీటీసీ స్థానాల కౌంటింగ్ ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో జరుగుతాయన్నారు.ఏజెంట్లు ఉదయం 7 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలన్నారు. కౌంటింగ్కు సంబంధించి జడ్పీ సీఈవో ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.